Tuesday, May 13, 2025

9వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు మిస్సింగ్

  • మైనర్‌ బాలికలు మిస్సింగ్‌
  • తల్లిదండ్రుల ఆందోళన
  • ఆగిరిపల్లి మండలంలో ఘటన
  • ఒక విద్యార్ధి వద్ద కొంత నగదు

ఏపీ :ఏలూరు జిల్లా 9వ తరగతి చదువుతున్న ముగ్గురు హై స్కూల్‌ విద్యార్ధినిలు మిస్సయిన ఘటన కలకలం రేగింది. ఆగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం స్కూలుకి వెళ్లిన విద్యార్ధులు తిరిగి రాకపోవడంతో స్కూల్లో ఉపాధ్యాయిని ఎంక్వెరీ చేశారు విద్యార్ధుల తల్లిదండ్రులు. ముగ్గురు విద్యార్ధినులు పాఠశాలను రాలేదని ఉపాధ్యాయుడు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్‌ విద్యార్ధులు కావడంతో పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం ఒక విద్యార్ధి కొంత నగదు కూడా వెంట తీసుకువెళ్ళినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్ధుల జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com