Monday, March 31, 2025

తిన్నారు.. పడుకున్నారు.. చనిపోయారు

నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి.. ఆసుపత్రిలో చేరిన తల్లి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల మృతి సంచలనంగా మారుతోంది. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన చెన్నయ్య అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నాడు. డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య పేరు రజిత. వీళ్లకు ముగ్గురు పిల్లలు. గురువారం రాత్రి తిని చెన్నయ్య పనికి వెళ్లిపోయాడు. భార్య పిల్లలు తిని పడుకున్నారు. పని నుంచి తిరిగి వచ్చేసరికి అంతా పడుకునే ఉన్నారు. వేకువజామున కడుపునొప్పితో భార్య గిలగిల కొట్టుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న భార్యను స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించాడు చెన్నయ్య. ఆ తర్వాత పిల్లల్ని చూస్తే అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. మళ్లీ స్థానికులను పిలిచి పరిశీలిస్తే ముగ్గురు మృతి చెందినట్టు గుర్తించారు.
కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నీళ్ల బకెట్‌లో ముంచి చంపేసింది
మైలార్‌దేపల్లిలో మరో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన మహిళ తన 14 రోజుల కుమార్తెను చంపేసింది. మహిళ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అదే టైంలో పాప పుట్టింది. పోషణ ఇబ్బంది అవుతుందని నీళ్ల బకెట్‌లో పడేసి హత్య చేసింది. భర్త వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాక కేసు నమోదు చేశారు.

పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య
ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భోలక్‌పూర్‌లో అత్తింటి వేధింపులు భరించ లేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు జిమ్‌ నిర్వాకుడితో నాలుగు నెలల క్రితమే వివాహమైంది. అనారోగ్య సమస్యలు గురించి చెప్పకుండా పెళ్లి చేశారని వేధిస్తూ వచ్చారు. వాటిని భరించలేక సూసైడ్ చేసుకుంది. పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి చనిపోయింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com