-
జార్ఖండ్ లో రైలు ప్రమాదం
-
చక్రధర్ పూర్లో పట్టాలు తప్పిన హౌరా మెయిల్
భారత్ లో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల రోజుల క్రితం కంచన్ జంగా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగిన నెల రోజులు గడవకముందే జార్ఖండ్ లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హౌరా నుంచి ముంబై వెళ్తున్న హౌరా మెయిల్ జార్ఖండ్లోని చక్రధర్ పూర్లో పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రాజ్ఖర్స్వాన్, బడాబాంబో మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హౌరా మెయిల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి సీఎస్ఎంటీ ముంబైకి వెళ్తోంది.
రైలు రాజ్ఖర్స్వాన్ నుంచి బడాబాంబో వైపు వెళ్తున్న టైంలో తెల్లవారుజామున ౩.౩౦ ప్రాంతంలో జార్ఖండ్లోప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగిపోయాయి. ఇంతలో వెనుక నుంచి అదే లైన్ లోకి వచ్చిన హౌరా-ముంబై మెయిల్ బోగీలను ఢీకొంది. ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఐతే హౌరా మెయిల్ లోకో పైలెట్ ఈ ప్రమాదాన్ని వెంటనే గ్రహించి.. చాకచక్యంగా వ్యవహరించి హోరా ముంబై రైలుకి జరగాల్సిన ఘోర ప్రమాదాన్ని నివారించినట్లు అదికారులు చెప్పారు.
లోకో పైలెట్ జాగ్రత్త చర్యల వల్ల ప్రయాణీకులెవరూ మరణించలేదు. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ రైలు ప్రమాదంలో కొంతమంది మృతి చెంది ఉండవచ్చని ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు ఇంకా మరణాలను ధృవీకరించలేదు. ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.