Friday, April 11, 2025

ఇక ప్రైవేట్​ వంతు

  • కాళేశ్వరం విచారణలో ట్రాన్స్​కో ఇంజినీర్లు, ప్రైవేట్​ వ్యక్తులు
  • కాంట్రాక్టర్లు, డిజైనర్లకు నోటీసులు నేటి నుంచి విచారణ

కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నీటిపారుదల శాఖ ఇంజినీర్ల విచారణను దాదాపుగా పూర్తి చేసింది. మొదటి దశలో మూడు ఆనకట్టలతో సంబంధం ఉన్న ప్రస్తుత, గత ఇంజినీర్లను కమిషన్​ విచారణ చేసింది. కమిషన్​ ఆదేశాల మేరకు ఆ తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. తాజా విడతలో మూడు పంప్​ హౌస్​లకు సంబంధించిన ఇంజినీర్లను కూడా కమిషన్​ విచారణ చేసింది. మొదట సీఈ మొదలు డిప్యూటీ ఈఈ స్థాయి వరకు ఇంజినీర్ల విచారణ మంగళవారం వరకు పూర్తయింది.

బుధవారం పంప్ ​హౌస్​లకు చెందిన ఏఈఈలు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు హాజరయ్యారు. పంప్​ హౌస్​ల నిర్మాణం, డిజైన్లు, నీటి నిల్వ సామర్థ్యం, ఆనకట్టల ఎత్తు, గతంలో పంప్​ హౌస్​లు మునిగిన సందర్భాలు, అప్పుడు తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై వారి నుంచి కమిషన్​ వివరాలు తీసుకొంది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఆదేశించారు. రేపటి నుంచి ట్రాన్స్​కో ఇంజినీర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులను విచారణ చేసేందుకు కమిషన్​ సిద్ధమవుతోంది. వీరిలో డిజైనర్లు, ప్రైవేట్​ కాంట్రాక్టర్లు ఉన్నారు.

జూన్​ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ మొదటగా నీటిపారుదలకు సంబంధించి, ప్రాజెక్టు ఇంజినీర్లను ప్రశ్నిస్తూ వచ్చింది. అందులో భాగంగా ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కమిషన్​​ ఇంజినీర్లను ప్రశ్నించింది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణను కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు పని చేసిన ప్రతి నీటిపారుదల ఇంజినీరును కమిషన్​ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్​ వేగాన్ని మరింత పెంచింది. అలాగే కొందరు సీనియర్​ ఇంజినీర్లతో కమిషన్​ రెండు, మూడు రోజుల పాటు విచారణ చేపట్టింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com