Monday, May 12, 2025

బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తాం

  • మారుతున్న కాలంతో పాటు కులవృత్తులు మారుతున్నాయి
  • బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక ఏర్పాటు చేస్తాం
  • రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని, బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తామని, మారుతున్న కాలంతో పాటు కులవృత్తులు మారుతున్నాయని రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు, బలహీనర్గాలు జ్యోతి రావు పూలేను దేవుడిగా పూజించాలన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందని, అధికారికంగా ఏదీ ప్రకటించ డానికి లేదని, బిసిలకు న్యాయం చేయాలని, తనతో పాటు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసిల అభివృద్ధి కి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com