Tuesday, April 22, 2025

మంత్రి లోకేష్ ను కలిసి సీఎంఆర్ఎఫ్ కు పలువురు విరాళాలు అందజేత

అమరావతిః ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి సీఎంఆర్ఎఫ్ కు పలువురు విరాళాలు అందజేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, ప్రజలు కలిసి రూ.10,50,000 చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. రాజమండ్రికి చెందిన జి.గోవిందరావు రూ.5 లక్షల విరాళం అందజేశారు.

విజయవాడకు చెందిన ట్విల్స్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని గమిని నవీన్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన గింజుపల్లి వీరయ్య చౌదరి రూ.2 లక్షల విరాళం అందజేశారు. శ్రీకాళహస్తికి చెందిన ఎన్.పున్నారావు రూ.లక్ష విరాళం అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com