Saturday, May 3, 2025

దొంగతనానికి వచ్చి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి

దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగతి సోలార్ ప్లాంట్లోతరచూ కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో వాటిని అరికట్టేందుకు దాని యజమానులు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.అయితే దొంగలు మొదటి కంచె కట్ చేసి రెండో కంచె కట్ చేసే క్రమంలో కరంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com