మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు పైలట్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన హెలికాప్టర్ మేళ్లచెరువు మండల కేంద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. భారీ వర్ష సూచన, గాలి దుమారం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా పైలట్ అలర్ట్ అయినట్లు సమాచారం. అయితే.. కోదాడలో ల్యాండింగ్ అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో మేళ్ల చెరువు వెళ్లిపోయారు.