పాక్కు మరో షాక్
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాక్ ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఎదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పసరని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.