అసలే… వేడెక్కే రాజకీయాలు, భయభ్రాంతులకు గురిచేసే యుధ్దాలతో ప్రపంచం అంతా నలిగిపోతుంటే… కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే… రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. అది అలాంటి ఇలాంటి జోస్యం కాదండోయ్ ప్రపంచానికి జోస్యం వవరేంటో చెప్పిన బాబా వంగా లాంటి జపాన్ బాబా వంగ ఊహించిన విషయం. ఇక ప్రపంచాన్ని రెండు మూడుళ్లు వణికించిన మహమ్మారి కరోనా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మహమ్మారి మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగా! నిజానికి, 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పగా.. ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్ దర్శిని, ర్యోటసుకి కూడా ఇలాంటి జోస్యమే చెప్డడం అంతటా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రాబోయేదంతా వినాశనమేనా.. మనుషుల మనుగడ ఇక కష్టమేనా.. ఇప్పటి వరకూ ఊహిస్తున్ డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయి…ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా…? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యం చెబుతున్న మాటలివి. జపాన్బాబా వంగా ప్రఖ్యాతి చెందిన ర్యోటసుకీ జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే విల్లడించినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన మాటలని అంత తేలికగా కొట్టి పారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే, ర్యోటసుకీ ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. . 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది.