Sunday, February 23, 2025

వెళ్లండి.. ఏపీలో రిపోర్ట్‌ చేయండి

ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం ఆదేశాలు

రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్​ అధికారులను ఆంధ్రప్రదేశ్​లో రిపోర్ట్​ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్​గా ఉన్న అంజనీ కుమార్​, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్​ అభిలాష బిస్త్, కరీంనగర్​ పోలీసు కమీషనర్​ అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు డీఓపీటీ కేటాయించింది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్​లు, ముగ్గురు ఐపీఎస్​లు అప్పట్లో క్యాట్​ను ఆశ్రయించారు. ఈ అంశంపై డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వీరి అభ్యర్థనలను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్‌ కమిటీని నియమించించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత అక్టోబరులో కొందరు ఐఏఎస్​లను ఏపీకి పంపించారు. ఇప్పుడు మరో ముగ్గురు ఐపీఎస్​లను ఏపీలో రిపోర్ట్‌ చేయాలని హోంశాఖ ఆదేశించింది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com