లోక్ సభలో 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యులు, ముఖ్యంగా వేతన జీవులలో సస్పెన్స్ పెంచినా కీలక ప్రకటన చేశారు. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంత వరకు వార్షిక వేతనం వచ్చే వారికి ఎలాంటి పన్ను ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వచ్చే వారం ప్రకటన చేస్తామన్నారు. కొత్త ఐటీ స్లాబ్ లపై వారం రోజుల్లో ప్రకటన చేస్తామని నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్లో పేర్కొన్నారు.
వేతన జీవులు అంచనాలేంటీ?
2020 సంవత్సరంలో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి కొత్త పన్ను వ్యవస్థకు పునాది వేశారు. ఇందులో రాయితీ పన్ను రేట్లు, కొన్ని తగ్గింపులు తొలగించారు. కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రయత్నం. గత బడ్జెట్ల్లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తుల కోసం మాత్రమే వ్యక్తిగత పన్నులో మార్పులు చేశారు. 2023-24లో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసేందుకు 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు ఈసారి చేశారు.
ఆదాయపు పన్ను స్లాబ్
2025-26 బడ్జెట్లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 300,000 నుంచి రూ. 350,000కి పెంచవచ్చని అనుకున్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని పెంచుతుందని భావించారు. ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగిస్తుందనుకున్నారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రవేశపెట్టవచ్చనే అంచనాలు చేశారు. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్న వ్యక్తులు పన్ను పరిమితి నుంచి మినహాయింపు ఇస్తుందేమో అనుకున్నారు. వార్షిక ఆదాయం రూ. 3,00,001- రూ. 6,00,000 లక్షల వరకు ఉన్న వారిపై 5 శాతం పన్ను, రూ. 6,00,001- రూ. 9,00,001 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి పడిపోతున్న వారిపై 10 శాతం పన్ను విధిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 9,00,001- రూ. 12,00,000పై 15%పన్ను విధించబడుతుంది. రూ. 12,00,001-15,00,000 వార్షిక ఆదాయంపై 20%, రూ. 15,00,001- రూ. 18,00,000 లక్షల వార్షిక ఆదాయంపై 25% రూ. 18,00,001 లక్షల వార్షిక ఆదాయంపై 30% పన్ను విధిస్తున్నారు. ఇందులో మార్పులు చేర్పులు చేస్తారని అనుకున్నారంత.
కొత్త పన్ను విధానంలో మినహాయింపు చాలా తక్కువ. ఇందులో, ఎన్పిఎస్లో ఉద్యోగికి యజమాని ఇచ్చే కంట్రిబ్యూషన్ను తగ్గించడం చాలా ముఖ్యమైన విషయం. వాస్తవానికి, గతేడాది ఎన్పిఎస్పై యజమానులు చేసే ఖర్చుకు తగ్గింపును ఉద్యోగి జీతంలో 10 శాతం నుంచిు 14 శాతానికి పెంచారు. అయితే జాతీయ పెన్షన్ స్కీమ్కు తో రూ. 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనాన్ని పెంచుతారని అంచనా వేసుకున్నారు. ఇది జీతం లేని పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. NPSకి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం.
పన్నుపై ఇంత మినహాయింపు పొందవచ్చు
సెక్షన్ 87A ప్రకారం కొత్త పన్ను విధానంలో, రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్నుపై 100% మినహాయింపును క్లెయిమ్ చేయగలరని భావించారు. తక్కువ ఆదాయ వర్గానికి మరిన్ని ప్రయోజనాలను అందించడానికి, ఈ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచవచ్చనుకున్నారు. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను శ్లాబులు 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక మినహాయింపు పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. దీనిని రూ. 50,000, అంటే రూ. 250,000 నుంచి రూ. 300,000 వరకు పెంచవచ్చని ఎదురు చూశారు. దీని వల్ల రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించే అవకాశం లేదని అనుకున్నారు.