Tuesday, June 3, 2025

శ్రీనిధి ఎండి జి.విద్యాసాగర్ రెడ్డిపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
శ్రీనిధి ఎండి జి.విద్యాసాగర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు తమ జీవనోపాధి కోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని శ్రీనిధి ద్వారా రుణాలు పొందుతున్నారన్నారు.

దీనిని ఆసరాగా చేసుకున్న శ్రీనిధి ఎండి జి.విద్యాసాగర్ రెడ్డి మహిళలను అగౌరవ పరుస్తూ వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బక్క జడ్సన్ మండిపడ్డారు. సుమారు 4 లక్షల సిమ్ కార్డులను కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా వాటిని మహిళలకు చేర్చి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్‌లో కూడా బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com