Sunday, September 29, 2024

సాంకేతిక, నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు

  • స్కిల్ డెవలప్‌మెంట్ కోసమే ఐటీఐలను ఏటిసిలుగా మారుస్తున్నాం
  • నిరుద్యోగులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తాం
  • నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం
  • సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవు

సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 65 ఐటీఐలను ఏటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తూ మల్లేపల్లి ఐటీఐలో మంగళవారం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు సిఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కోసమే ఐటీఐలను ఏటిసిలుగా మారుస్తున్నామన్నారు. రూ.50 కోట్లతో మల్లేపల్లిలో ఏటిసిని నిర్మిస్తున్నామని సిఎం తెలిపారు. త్వరలో రాష్ట్రంలో నలుమూలలా ఏటిసిలను ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ అన్నారు. పదేళ్లుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడతారన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ అవకాశాలకు దారి చూపెడుతుందన్నారు.

40 లక్షల మంది ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ…
40 లక్షల మంది యువతీ, యువకులు ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని, సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవని ప్రపంచంతో పోటీపడాలంటే సర్టిఫికెట్లతో పాటు సాంకేతికత అవసరమని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రోబోలు మొదలుకుని ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు.

తాము పాలకులం కాదు, సేవకులం అని సిఎం రేవంత్ అన్నారు. టాటా సంస్థ సహకారం తో రూ. 2,324 కోట్లతో 64 ఐటీఐలను ఏటిసిలుగా మారుస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. సాంకేతికతను అందించడానికి ముందుకొచ్చిన టాటాను అభినందిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు వాళ్లు ఉన్నారన్నారు. ఐటీఐలను ఎంత అభివృద్ధి పరిస్తే అంత మంచిదన్నారు. ఐటీఐలు ఇంతకు మందు వేరు ఇపుడు వేరని, ఇక ముందు ఐటీఐలను తానే పర్యవేక్షిస్తానని రేవంత్ చెప్పారు. ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని, తానే పర్యవేక్షిస్తానని, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

31,200 మందికి 23 రకాల కోర్సుల్లో శిక్షణ
ఐటీఐలను ఏటిసిలుగా మార్చేందుకు రెండు నెలల క్రితమే టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏటిసిల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏటిసిల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కేంద్రాల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏటా రూ.307.96 కోట్లు కాగా, టిటిఎల్ వాటా రూ.2,016.25 కోట్లుగా ఉంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగాలు కల్పించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular