Thursday, September 19, 2024

హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్

హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై అంతకంతకు పెరిగిపోతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా మత్తు మందు కేటుగాళ్లు డ్రగ్స్ వ్యాపారం చేస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్ల పడకుండా చాక్లెట్ రూపంలో గంజాయి సహా మత్తుపదార్థాలను విక్రయిస్తోన్న ముఠాలు.. ఇప్పడు మరో కొత్త రూట్ ఎంచుకున్నాయి. హైదరాబాద్ లో ఎవరికీ అనుమానం రాకుండా ఐస్‌క్రీమ్ రూపంలో డ్రగ్స్ సప్లై చేస్తూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకు వచ్చాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ లోని ఓ పార్లర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ డ్రగ్ ఐస్‌క్రీమ్‌ల గుట్టురట్టయ్యింది.

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 1 లో వన్‌ అండ్‌ ఫైవ్‌ పార్లర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. ఐస్‌ క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిసి అమ్ముతున్న మత్తు మందు ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వన్‌ అండ్‌ ఫైవ్‌ పార్లర్ నిర్వాహకులు దయాకర్‌ రెడ్డి, శోభన్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీ లీటర్ల విస్కీని కలుపుతున్నట్టు గుర్తించారు. సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తమ పార్లర్ కు వచ్చే కస్టమర్లకు ఇలా మత్తును అలవాటు చేస్తూ వ్యాపారం చేస్తుండటంతో సర్వత్రా భయాందోళన వ్యక్తం అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular