Tuesday, May 6, 2025

ఎవరిపై ఉద్యోగ సంఘాల సమరం?

ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం..మనం పాలకులం కాదు.. సేవకులం.. నా తో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  హైదరాబాద్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులకు ‘‘రియల్‌ ‌హీరోస్‌ ‌జీ అవార్డస్-2025’’ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడు తున్నారని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శ ంగా నిలబడి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహ ద్దుల్లోని సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. పోలీస్‌ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది. విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తు న్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉండగలు గుతున్నామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి కొనియాడారు. ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నాం.

విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ ‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అడిషనల్‌ ఎస్పీ, ఎస్పీ ల కుటుంబాలకు రూ. కోటిన్నర అంది స్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన పోలీస్‌ ‌కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్‌ ‌పిల్లల భవిష్యత్‌ ‌కోసం 50 ఎకరాల్లో యంగ్‌ ఇం‌డియా పోలీస్‌ ‌స్కూల్‌ను ప్రారంభించుకున్నామని వారికి మంచి భవిష్యత్‌ను అందించే బాధ్యత మాదేనని తెలిపారు. డ్రగ్స్ ‌నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ ‌విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్‌ ‌క్రైమ్‌ ‌నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశాం.  నేరం జరిగినప్పుడే కాదు.. నేరం జరగ కుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు.

రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులు కావొద్దు..
ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటి స్తున్నాయని, వారి సమరం తెలంగాణ ప్రజల పైనా? ఎందుకు సమరం? గతంలో లేని విధ ంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతీ నెలా ఏడు వేల కోట్లు ప్రతీ నెలా కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ‌బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి.. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్‌ ‌పెట్టి వెళ్లిన బకాయిలే.. కేవలం 16 నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. ఉచిత విద్యుత్‌ అని చెప్పి విద్యుత్‌ ‌శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టి వెళ్లారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి.. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు.  11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఉండదని అన్నారు.ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై ఉందని,  ఉద్యోగ సంఘాల నాయకులకు ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామని పిలుపునిచ్చారు. మనం సమరం చేయడానికి ఇక్కడ లేము.. ప్రజలకు సేవచేయడానికే ఇక్కడ ఉన్నామన్నారు.

ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడినవారు ఎవరూ లేరని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు . కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది.  బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని అన్నారు.  అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు%•% స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉద్యోగ సంఘాల నాయకులు  రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దని సీఎం రేవంత్‌  ‌కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. నన్ను కోసినా వొచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను. ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి%•% ఇపుడు ఫామ్‌ ‌హౌస్‌ ‌లో హాయిగా పడుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు. సమయస్ఫూర్తి, సంయమనం. ఉద్యోగ సంఘాలను కోరుతున్నది  ఒక్కటేనని, తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దని అన్నారు. తనతో కలిసి రావాలని,  తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com