Saturday, September 21, 2024

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం! సీఎం వ్యూహమేమిటి..?

“ నువ్వు నేర్పిన విద్యే కదా.. నీరజాక్ష” అన్నట్టుగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యూహమే ఇప్పుడు ఆ పార్టీని అవసానదశకు పడేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎలా ఫిరాయింపులకు ప్రోత్సహించారో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ప్లాన్ చేస్తుంది. ఆర్‌ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 26 మందిని కాంగ్రెస్‌లో చేర్చుకునేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్‌లో ఏడుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేరారు. కాసేపట్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ చేరనున్నారు. దీంతో మొత్తంగా ఎనిమిదికి సంఖ్య చేరుకోనుంది. అయితే బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటే మూడింట రెండింతల మెజార్టీ అవసరం అవుతుంది. అందుకే మరో 18 మందిని చేర్చుకోవాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. మొత్తం 26 మందిని చేర్చుకున్నట్లైతే బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడే అవకాశం ఉండదు.

ఒకవేళ 27 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పడిపోనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒక వేళ ఇది జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేకల్లా చేరికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. బీఆర్‌ఎస్‌లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని.. ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular