యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
బిసిలకు ప్రాధాన్యం ఇవ్వాలి
గాంధీభవన్ ఎదుట జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నిరసన
యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవ సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్ ఎదుట జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి శాంతియుత నిరసన చేపట్టింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు. యాదవులకు మూడు ఎమ్మెల్సీలు, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బిసిలకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు బిసి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.