Friday, September 20, 2024

యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి

యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
బిసిలకు ప్రాధాన్యం ఇవ్వాలి
గాంధీభవన్ ఎదుట జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నిరసన

యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవ సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్ ఎదుట జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి శాంతియుత నిరసన చేపట్టింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు. యాదవులకు మూడు ఎమ్మెల్సీలు, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే బిసిలకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు బిసి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos