Saturday, May 4, 2024

YS Sowbagyamma: మనోవేదన నీకు తెలుసు సీఎం జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ

టీఎస్, న్యూస్: సిఎం జగన్ మోహన్ రెడ్డికి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. తండ్రి ని కోల్పోయిన మనోవేదన మీకు తెలుసు అంటూ లేఖ లో ప్రస్తావించారు. 2009 లో తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.. 2019 లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాని, వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కువ బాధించినట్టుగా ఆవేదన్ వ్యక్తం చేశారు. తమ కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం తమ్మల్ని ఎక్కువగా బాదపెట్టిన అంశంగా ఉంది అని అన్నారు. హత్యకు కారణం ఆయిన వాళ్లకు సీఎం గా రక్షణగా ఉండటం బాధ కలిగిస్తుంది అని అన్నారు.

“ నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈ విధంగా మాట్లాడటం, సీఎం పత్రిక, టీవీ చానెల్ లో , సోషల్ మీడియాలో , వైసీపీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా అసహనం చేయించడం ఇది నీకు తగునా అని ప్రశ్నించారు. ఇదంతా జరిగినా న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళను హేళన చేస్తూ, నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని నిలదీశారు.

సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే..

 ఇన్సుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటన్నారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. అంతే కాకుండా హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని ఎందుకు కల్పించారని నిలదీశారు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేశారని, ఇప్పటికైనా న్యాయం, ధర్మం ఆలోచన చేయాలని కోరారు. సీఎం గా రాగ, ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేశారని, ఆఖరు గా న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నట్లు సౌభాగ్యమ్మ లేఖలో ప్రస్తావించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular