ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు నామమాత్రపు చర్యలు చేపట్టి పని చేయడం దారుణమన్నారు.. వైసిపి హయాంలో జరిగిన మంచి పనులను ప్రజలు ఇప్పటికి కూడా గుర్తుంచుకొని చెప్తున్నారని అన్నారు..వరదలను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు..వరద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు,బాధితులకు పూర్తి సహాయం అందెవరకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
ఈ పంపిణి కార్యక్రమంలో వైసీపీ నాయకులు వై.సిద్దార్థ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య న్యాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,కార్యకర్తలు పాల్గొన్నారు.