Tuesday, February 25, 2025

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విష సర్పాలు అదుపులో ఇద్దరు మహిళలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. ఎయిర్‌పోర్టులో పాములు పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి పాములు తీసుకొస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారని అనుమానం వ్యక్తమవుతున్నది. వారిద్దరు పథకం ప్రకారంమే పాములను తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com