Saturday, April 19, 2025

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం

మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటి మిట్ట దగ్గర వరకు వెళ్లిన తర్వాత విమానంలో సాంకేతిక లోపం కారణంగా మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు.

హైదరాబాద్ నుంచి ఉదయం 6: 35గంటలకు బయలుదేరి
7: 30 గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల తిరిగి 8: 30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతికలోపం తలెత్తినా ప్రమాదమేమీ జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com