Monday, May 20, 2024

కాంగ్రెస్‌లో చేరిన అజ్మీరా ఆత్మరాం నాయక్

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్

అజ్మీరా ఆత్మరాం నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అజ్మీరా ఆత్మారాం నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆయన 2018,2023 ఎన్నికల్లో రెండు దఫాలుగా బిజెపి తరపున అసిఫాబాద్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి, ప్రాథమిక కేఏసీల సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని అజ్మీరా ఆత్మరాం నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అజ్మీరా ఆత్మరాం నాయక్ పాటు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోతు రవి నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహబూబ్ అలీలతో పాటు సేవాలాల్ సేన జిల్లా నాయకులు జరుకుల తిరుపతి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మోహన్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటి సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular