Monday, May 20, 2024

గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండాలి

  • గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండాలి
  • పి ఆర్ సి కమిటి కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి

గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టు ల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అధికారుల బృందం ఈ రోజు పి ఆర్ సి కమీషన్ చైర్మన్ శ్రీ శివ శంకర్, సభ్యులు రామయ్య గార్లను కలిసి విజ్ఞప్తి చేసింది.

అదే విధం గా గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, స్టేట్ సివిల్ సర్వీస్ గా గ్రూప్ 1 సర్వీస్ లోని పోస్టులను పరిగణించడం తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా గ్రూప్ 1 అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని పి ఆర్ సి కమీషన్ ను కోరారు.
చాలా శాఖ ల లో పదోన్నతులకు ఏళ్ల తరబడి సమయం పడుతున్నందున కాలానుగుణ ( Time Bound ) పదోన్నతులు ఇచ్చేలా చూడాలని కోరారు.

సి పి ఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిచేలా చూడాలని ఈ లోగా 2004 కన్నా ముందు జారీ అయిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని గ్రూప్ 1 అధికారుల సంఘం కోరింది.

ఈ సమావేశం లో ఈ సమావేశం లో అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్ ఇతర అధికారులు వేణు మాధవరెడ్డి, హరికిషన్, రమేష్,ప్ర్రేం కుమార్,అనితా గ్రేస్, జయశ్రీ, వెంకన్న, విజయ్,నాగరాజు, యాదగిరి, సోమశేఖర్, యూనూస్, మైత్రి ప్రియ,ప్రశాంతి, పాపయ్య
తదితరులు పాల్గొన్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular