Tuesday, April 22, 2025

బలరాం నాయక్ తల్లి లక్ష్మిబాయి మృతిపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతాపం

మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మిబాయి మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మిబాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ఆయన ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పోరిక బలరాం నాయక్‌కు తల్లి లక్ష్మి బాయి (100) అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు వరంగల్ అరవింద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. నేడు వరంగల్ (హన్మకొండలో) దహన సంస్కరాలు జరుగుతాయని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

మంత్రుల సంతాపం
మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మాతృవియోగంపై మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మిభాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రులు ఆ దేవుడిని ప్రార్థించారు. బలరాం నాయక్ కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని వారు వేడుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com