Sunday, May 19, 2024

బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు భారీ షాక్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. స్థానిక ఎంపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీలకు చెందిన 100 నుంచి 200ల మంది ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరారు. గురువారం హైదరాబాద్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఎంపి రంజిత్ రెడ్డితో కలసి పని చేసేందుకు పార్టీలో చేరినట్టు వారంతా స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ మాజీ జడ్పీటిసి జిల్లెల నరేందర్ రెడ్డి, కందుకూరు జడ్పీటిసి బొక్క జంగారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సిద్దాల దశరథ, రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన నరసింహ యాదవ్, కార్పొరేటర్ బచ్చన బోయిన పద్మ,

రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, అనిత నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బిన్ ఖలీఫా, జల్‌పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ తేజిస్వీని శ్రీకాంత్, కొండల్ యాదవ్, కౌన్సిలర్ అవల్గీ, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ జడ్పీటిసి జిల్లెల్ల నరేందర్ రెడ్డి, జిల్లాలగూడ మాజీ సర్పంచ్ జిల్లెల్ల వనిత నరేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు చల్వది రాజేష్, దేరంగులు యాదయ్య, బొబ్బిలి కిరణ్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి విజయ్ గౌడ్, భీమ్ రాజ్ శంకర్, శ్రీ కాంత్, బద్దం అనిల్ గౌడ్, గ్యార అనిల్ కుమార్, తదితరులు కండువా కప్పుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular