Sunday, May 19, 2024

కారును ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు వ్యక్తులు మృతి..

రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..

తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది..

నరేశ్‌ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్‌ అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మృతులను వెంకటాపుర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసమైంది..

ఎయిర్‌ బెలూన్‌లు సకాలంలో తెరుచు కోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular