రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..
తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది..
నరేశ్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్ అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మృతులను వెంకటాపుర్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసమైంది..
ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచు కోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు..