Sunday, September 29, 2024

వెండి తెరపై తెలంగాణా కీర్తి పతాకం – పైడి జైరాజ్! -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని, స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ లో తనదైన ప్రతిభతో

ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందాడని, కరీంనగర్ నుంచి మొదలెట్టి హైదరాబాద్ వ్యాయామశాలలలో శిక్షణ పొంది, జాతీయ చలనచిత్ర సీమను కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన గొప్ప నటుడు పైడి జైరాజ్ అనీ, సినిమాలలో నటించాలనే తన కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని గెలిచిన జైరాజ్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో సినీరంగంలో ఎదుగుదామనుకునే నవ యువ దర్శకులు, నటులు

ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

 

పైడి జయరాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర, పైడి జయరాజ్ జీవితం పై రాసిన “ద ఫస్ట్ యాక్షన్ హీరో ” పుస్తకాన్ని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

 

పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర పైడి జయరాజ్ 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారని,

దాదాపు 130కి పైగా సినిమాలలో హీరోగా నటించారని, మూకీ సినిమాల కాలం లోనే తెలంగాణ ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లి ఆనాటి పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్,అశోక్ కుమార్ వంటి

గొప్ప నటుల సరసన తనదైన ముద్రను వేసి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగుర వేశాడు అని వివరించారు. ఆయన జీవిత చరిత్రని పుస్తకం గానే కాకుండా, డాక్యుమెంటరీగా కూడా తీశామని, దీనికోసం వందలాది ఫోటోగ్రాఫ్ లను జైరాజ్ గారి వారసుల నుంచి సేకరించి

ఈ గ్రంథ రచన చేశామని

వివరించారు. ఆయన పేరిట తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని వినతి పత్రం అందించారు.

 

ఈ పుస్తకావిష్కరణలో రవాణా,

బీసీ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి ఇతరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular