టీఎస్, న్యూస్ :రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సీఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.