టీఎస్, న్యూస్ :’ఢిల్లీ దర్బార్’ పేరుతో మరో వినూత్నమైన ప్రచార వీడియో విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్.ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ ‘ఢిల్లీ దర్బార్’ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మరో వీడియో విడుదల చేసింది.
జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు ఇస్తూ, తెలంగాణకు తక్కువ నిధులు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్న విషయాన్ని వినూత్నంగా వీడియోలో పొందుపరిచారు. బీజేపీ తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చినట్లు వీడియోలో చూపెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.