టీఎస్ న్యూస్ :జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు.. తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు.తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగించారు.పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చెరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది.బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలు లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ రిలీజ్లో తెలిపింది.