టీఎస్, న్యూస్ :ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించగా.. హరీష్ గుప్తా పేరును డీజీపీగా సెలక్ట్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. సోమవారం సాయంత్రం లోగా డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది.