Saturday, September 21, 2024

సిఎం సహాయనిధికి భారీగా విరాళాలు

వరద బాధితులకు సహాయం చేసేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుల సహయార్ధం భాష్యం విద్యాసంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి 25 లక్షల రూపాయలను భాష్యం విద్యాసంస్థ విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఇటీవలే ఎపి సిఎం చంద్రబాబును కలిసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ రూ.4 కోట్ల భారీ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు శ్రీఇందు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనలఖ ఇనిస్టిట్యూషన్స్ (ఇబ్రహీంపట్నం) చైర్మన్ వెంకట్‌రావు రూ.10 లక్షల చెక్కును సిఎంను కలిసి అందచేయగా, జిఆర్టీ జ్యువెలర్స్ అధినేత జితేందర్ సైతం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల చెక్కను సిఎంకు శుక్రవారం అందచేశారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular