రైల్ పాస్తో ప్రయాణించే విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో తీపికబురు అందించింది. గతంలో మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు స్మార్ట్ కార్డు పాసులను జారీ చేసిన విషయం తెలిసిందే. 20 ట్రిప్పులకు పాస్ తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని అప్పట్లో మెట్రో కల్పించింది.
అయితే జూలై 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గతంలో తెలిపింది. అయితే గతనెలతో గడువు పూర్తి కావడంతో మంగళవారం ట్విట్టర్ వేదికగా మెట్రో ఒక ప్రకటన చేసింది. స్టూడెంట్ మెట్రో కార్డు ప్రయాణాలు ఈ నెల 30వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు.