Tuesday, April 22, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం, రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీలు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సిఎం రేవంత్ నివాసంలో పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కడియం శ్రీహరి లేదా కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలిసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఈనెల 06వ తేదీన తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆ సభకు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు మల్లికార్జున ఖర్గేలు హాజరుకానున్న నేపథ్యంలో వారి సమక్షంలో కేకే కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com