టీఎస్, న్యూస్:తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్లో కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తయ్యింది. అయితే, మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.
జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక గతేడాది మే 9న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సారి 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.