Friday, May 17, 2024

రాయదుర్గం పబ్‌లో కత్తితో దాడి ముగ్గురికి గాయాలు

టీఎస్, న్యూస్ :హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. అది కాస్తా కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన రాయదుర్గం సమీపంలోని ఓ పబ్‌లో జరిగింది.

అసలేం జరిగిందంటే..

గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఓ పబ్ ఉంది. అందులో పబ్ బౌన్సర్ అమీర్- సర్వీస్ కెప్టెన్ కృతిక్ పని చేస్తున్నారు. పబ్‌కి వచ్చిన కస్టమర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్త ఘర్షణకు దారి తీశాయి.గొడవ జరుగుతున్న సమయంలో ఈ విషయం కృతిక్ ఫ్రెండ్స్ క్రాంతి, కల్యాణ్‌లకు తెలిసింది. వీరు మరో ఇద్దరిని వెంట బెట్టుకుని పబ్‌కి వచ్చారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. చివరకు బౌన్సర్ అమీర్‌ కిచెన్‌ లోకి కత్తి తీసుకుని నలుగురిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో కల్యాణ్, మల్లికార్జున్ కత్తిపోట్లకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular