నరెడ్కో తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మేకా విజయ్ సాయి ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన 28వ వార్షిక సభ్య సమావేశంలో నరెడ్కో తెలంగాణ కొత్త కమిటీని ఎన్నుకున్నది. కాళీ ప్రసాద్, వై కిరణ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు. నూతన సంఘానికి సెక్రటరీ జనరల్ గా కె.శ్రీధర్రెడ్డి, కోశాధికారిగా ఆర్ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తారు. నరెడ్కో తెలంగాణలో సుమారు మూడు వందలకు పైగా బిల్డర్లు సభ్యులుగా ఉన్నారు.