Tuesday, April 22, 2025

ఉప్పల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైలు సేవలను  పొడిగించిన హైదరాబాద్ మెట్రో యాజమాన్యం 

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈనెల 25వ తేదీన ఉప్పల్ మైదానంలో ఐపిఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ రోజున రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. రాత్రి 12:15 గంటలకు చివరి రైలు ప్రారంభమై రాత్రి 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఉప్పల్ స్టేడియం – ఎన్జీఆర్‌ఐ స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో రైలు దిగే వారికే అనుమతి ఉంటుందని ఎక్కడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com