- ఆయన మాటలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
కెటిఆర్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. గాంధీభవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పడిందని, కెసిఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని ఆయన అన్నారు. కెసిఆర్, కెటిఆర్లు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చ గొట్టి ఆంధ్ర ప్రాంత వ్యక్తి పేరు మీద 95ఎకరాలు కేటాయించారని, తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కావాలని కాంగ్రెస్ కోరిందని, రాయల తెలంగాణను వ్యతిరేకించిందని ఆయన అన్నారు.