Saturday, September 21, 2024

చంద్రబాబుకు దేవుడే బుద్ధి చెబుతాడు: సీదిరి అప్పలరాజు

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా శ్రీవారి ప్రసాదానికి అవమానం పరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఈరోజు శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవదేవుని సన్నిధి అయిన మందస లో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులకు తగు రీతిలో బుద్ధి చెప్పాలని ఆ దేవుడిని ప్రార్థించారు
అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో దేవుని చుట్టూ అనేక రాజకీయాలు చూశాం కానీ దేవుని కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయం చేయడం మాత్రం
చంద్రబాబు నాయుడుకి మాత్రమే చెల్లిందని ఆయన అన్నారు
చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా మాట్లాడితే టిటిడి ఈవో శ్యామలరావు దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావుతీస్తుంది
వైసీపీ ప్రభుత్వ హయాంలో తమిళనాడుకు చెందిన అగ్రి ఫుడ్ సంస్థ శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిని సరఫరా చేయడానికి టెండర్ దక్కించుకుంది టెండర్ దక్కించుకున్న కంపెనీలు శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిని సరఫరా చేయడం అనేది ఆనవాయితీ, ప్రసాదానికి వాడే ఏ ముడి సరుకులు అయినా ఎన్ ఏ బి ఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్ సర్టిఫికేషన్ జరిగిన తరువాతే శ్రీవారి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాయి అవి చేరుకున్న తరువాత కూడా టీటీడీకి సంబంధించిన ల్యాబ్స్ లో పరీక్షల అనంతరమే వాటిని ప్రసాదానికి ఉపయోగిస్తారు ఈ సందర్భంలోనే జూన్ నెలలో వచ్చిన నాలుగు ట్యాంకుల నెయ్యి నాణ్యత లేనిదని టీటీడీ ల్యాబ్స్ నిర్ధారించిన తర్వాత వాటిని వెనుకకు పంపించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఇదేవిధంగా 18 ట్యాంకులను నాణ్యతలేని నెయ్యగా పరిశీలించి వెనుకకు పంపించడం జరిగింది. నాణ్యతలేని ముడి సరుకులు వెనుకకు పంపించడం వాటి స్థానంలో నాణ్యత గల ముడి సరుకులను తెప్పించడం అనేది టీటీడీ లో సాధారణంగా జరిగే ప్రక్రియ.
ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు వక్రీకరించి మాట్లాడుతూ శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.
ఈ మాటలు యొక్క ప్రభావం దాని తీవ్రత ఎంత ఉంటుందో అన్నది కనీసం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
ఇదే సందర్భంలో లోకేష్ మాట్లాడుతూ శ్రీవారికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ నందిని నెయ్యి కంపెనీ వారికి ఎందుకు ఇవ్వరని అన్నారు, ఈ నందిని నెయ్యి కంపెనీ కేఎంఎఫ్ సంస్థకు అనుబంధం సంస్థగా ఉంది దానితోపాటు హెరిటేజ్ సంస్థకు కూడా అనుబంధ సంస్థగా కేఎంఎఫ్ సంస్థ ఉన్నది, అలాగే ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ప్రస్తుతం టెండర్ చేజిక్కించుకున్న కంపెనీ కేవలం 340 రూపాయలకు మాత్రమే కిలో నెయ్యి సప్లై చేస్తుందని అంత తక్కువ ధరకు నెయ్యి కొనడం ఏమిటని దీని ధర కనీసం 500 రూపాయలైనా ఉండాలని ఆయన మాట్లాడటం చూస్తుంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం తదుపరి టెండర్ ఎవరికి ఇవ్వాలో ఎంత రేటుకు ఇవ్వాలో వారే నిశ్చయించుకొని ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తమకు లబ్ధి చేకూర్చుకోవాలని ఉద్దేశంతో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది తమకు నచ్చిన సంస్థకు నచ్చిన రేటుకు కాంట్రాక్టు ఇవ్వడానికి ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నారు.
దేవుడి ప్రసాదం మీద రాజకీయం ఏమిటి? ఇది చాలా దుర్మార్గం ఇంతకు ముందు జరిగిన శిక్ష చంద్రబాబుకు గుర్తులేదా?
చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుష్ప్రచారం అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకున్నారు అందులో ముఖ్యంగా ఉత్తరాది మీడియా అయితే వారి పత్రికలలో దీనినే ప్రధాన వార్తగా ప్రచురితం చేస్తోంది దక్షణాది రాష్ట్రాల లో ఉన్న పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాల పవిత్రత పై ప్రజలలో అనుమానాలను రేకెత్తిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.
ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోని టీటీడీ క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ అన్నది చాలా శక్తివంతమైనది ప్రసాదానికి వాడే ముడి సరుకులు అన్నింటిని తమ టీటీడీ ల్యాబ్స్ లో పరీక్షించిన అనంతరమే వాటిని ప్రసాదానికి ఉపయోగిస్తారని ఇందులో ఎలాంటి రాజీ పడే అవకాశం లేదని ఎవరి ప్రలోభాలకు లొంగదని ఇది చాలా శక్తివంతమైన సంస్థ అని ఆయన పేర్కొన్నారు.
ఈ దుష్ప్రచారాలను ప్రజలేవరూ నమ్మొద్దని ఎవరి ప్రలోభాలకు గురికావద్దని భక్తులందరూ నిశ్చంతగా, నిర్భయంగా ఉండాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు
ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసే వారిని దేవుడు క్షమించడని ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని,  ఆయన అన్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular