Saturday, April 19, 2025

ఏపీ-తెలంగాణలోనే భారీ గణనాధుడు

వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా భక్తి శ్రద్దలతో చేసుకుంటున్నారు. ఊరు వాడ అంతా గణనాధుల ప్రతిమలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే భారీ గణపతిని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియ్ అయిన గాజువాక డిపో వద్ద లంబోధర ట్రస్టు ఆధ్వర్యంలో అత్యంత భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో విగ్రహానికి శుక్రవారం తుదిరూపుకు సంబందించిన పనులను పూర్తి చేశారు. ఈ భారీ గణనాధునిడిని కాలుష్య రహితంగా రూపు దిద్దే క్రమంలో బొడ్డ గణపయ్య నుదుట నామాలు అలంకరణ ప్రక్రియ చేపట్టారు. అంతే కాకుండా పూర్తిస్థాయిలో బెల్లం వినాయక విగ్రహంగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు పనులు కొనసాగాయని నిర్వాహకులు చెప్పారు. శనివారం సాయంత్రం ఈ భారీ వినాయకుడు తొలి పూజలు జరగనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వినాయకుడిగా రికార్డు నెలకొల్పుతున్న భారీ నణనాధునిడిని చూసేందుకు ఆంతా ఆసక్తి చూపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com