ఏపీః ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలు ఎవరికి వారే తమ వ్యూహాలను రెఢీ చేసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న టీడీపీ వర్క్షాప్ నిర్వహిస్తోంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై నేతలకు పార్టీ వ్యూహాలపై పోల్ మేనేజ్మెంట్ గురించి సలహాలు, సూచనలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల బరిలో ఏ విధంగా దిగాలి ముందడుగు ఎలా వేయాలన్న దాని పై టీడీపీ ఓ వర్క్ షాప్ నిర్వహించనుంది. రెండు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను కూడా నిర్ణయించి ప్రకటించనున్నట్లు సమాచారం.