తెలంగాణలో టెట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్లో, డిసెంబర్లో టెట్ పరీక్షలు నిర్వహించనుంది.
ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాసుకోవచ్చని.. జీవోలో తెలిపింది. ఇక డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.