పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. తాజాగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే సిద్ధిపేట, జహీరాబాద్కు ప్రధాని మోడీ వచ్చి వెళ్లారు. ఆ తర్వాత అమిత్ షా కూడా పాతబస్తీలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అనంతరం మల్కాజిగిరికి రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేశారు.