Sunday, May 19, 2024

కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్ బురదజల్లుతోంది

  • సిఎం రేవంత్‌కు బిజెపిలో చేరాల్సిన అవసరం ఏముంది..?
  • రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారని బిఆర్‌ఎస్ చేస్తున్న బురద జల్లే ప్రయత్నం అని, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండి బిజెపిలో చేరాల్సిన అవసరం ఏంటి అని రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిఆర్‌ఎస్ అసత్య ప్రసారం చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఈ దుష్ప్రచారం అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పుకొచ్చారు.

విభజన పంపకాలకు సంబంధించి ఎపికి సంబంధించి ఏ ముఖ్యమంత్రి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని పరిష్కరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దేశాన్ని పాడు చేస్తుంది భారతీయ జనతా పార్టీయేనని ఆయన అన్నారు. వైసిపి, టిడిపి విషయంలో పూర్తి స్థాయిలో అలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రజలంతా సానుకూల దృక్పథంతో ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పని చేస్తుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular