Sunday, May 5, 2024

“ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” కి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ

చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు సెన్సార్ ప్రశంసలు దక్కాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ్రీలత – నాగార్జున సామ‌ల‌, శారదా – శ్రీష్ కుమార్ గుండా, విజయ – డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామికి ప్రశంసలు అందజేశారు.

ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుడు అన్న విషయం తెలియకుండానే బోర్డ్ మెంబర్స్ సినిమాను చూశారు. తర్వాత తమ సభ్యుడే ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. సెన్సార్ బృందం స్పందిస్తూ – తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”లో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా.. ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. అని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular