బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఇతర పార్టీ నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.