Tuesday, May 21, 2024

మీ స్కూల్ ను పేల్చేస్తాం స్కూల్లకు బాంబు బెదిరింపులు

టీఎస్, న్యూస్ :ఢిల్లీలోని నోయిడాలో అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీలోని దాదాపు యాభై పాఠశాలలకు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.

బాంబ్ స్క్కాడ్ తనిఖీలు…

దీంతో స్కూళ్లనుంచి విద్యార్థులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపించి వేశారు. బాంబ్ స్క్కాడ్ రంగంలోకి దిగి పాఠశాలల్లో తనిఖీలను చేపట్టింది. ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకే ఈ బెదిరింపులు వచ్చాయి. నోయిడాలోని పన్నెండు పాఠశాలలకు బెదిరింపుల మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్కూళ్లు తెరవకముందే మెయిల్స్ రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular