Monday, May 12, 2025

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు..

టీఎస్ న్యూస్‌ న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం,(ఫెమా) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్త దర్శన్‌ హీరానందానికి కూడా సమన్లు పంపింది. కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరు కాలేదు. ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదా లు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడో సారి ఆమెకు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com